టీటీడీకి సాధ్యమైనంత మంచి సేవలందిస్తాం
ABN , First Publish Date - 2020-12-01T09:45:34+05:30 IST
టీటీడీకి సాధ్యమైనంత మంచి సేవలు అందిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినే్షకుమార్ ఖారా తెలిపారు.
ఎస్బీఐ చైర్మన్ దినే్షకుమార్ ఖారా
తిరుమల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి సాధ్యమైనంత మంచి సేవలు అందిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినే్షకుమార్ ఖారా తెలిపారు. సోమవారం ఉదయం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం పలకగా, శ్రీవారి చిత్రపటం, లడ్డూప్రసాదాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు. ఆలయం వెలుపల దినే్షకుమార్ను డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇవ్వాలంటూ టీటీడీ బోర్డు చేసిన విన్నపంపై మీడియా ప్రశ్నించగా టీటీడీకి సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇకపైనా ఈ సేవలను కొనసాగిస్తామన్నారు. సాధ్యమైనంత వరకు బెస్ట్ సర్వీస్ ఇస్తామని చెప్పారు.