శ్రీవారిని దర్శించుకున్న ఆండవన్ పీఠాధిపతి
ABN , First Publish Date - 2021-03-08T09:33:49+05:30 IST
తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ ఆదివారం తిరుమల
తిరుమల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శ్రీవారి దర్శనం చేయించారు.