టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లు: ఈవో
ABN , First Publish Date - 2020-08-09T18:47:55+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ఈవో అనిల్కుమార్ సింఘాల్ ప్రకటించారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ఈవో అనిల్కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి నిధులు తీసుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ నెలాఖరు తర్వాత కేంద్రం ప్రకటించే అన్లాక్ నిబంధనలను బట్టి.. బ్రహ్మోత్సవాలపై పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు మాతో చర్చించలేదని, పాజిటివ్ వచ్చిన అర్చకుల్లో ఎక్కువ మంది చికిత్స నుంచి కోలుకుని తిరిగి విధులకు వస్తున్నారన్నారు. అర్చకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని అనిల్కుమార్ స్పష్టం చేశారు.