75 మందితో టీటీడీ బోర్డు.. కేంద్రమంత్రులకు జగన్ సర్కార్ ఆఫర్లు?
ABN , First Publish Date - 2021-09-14T01:56:25+05:30 IST
75 మందితో టీటీడీ బోర్డు.. కేంద్రమంత్రులకు జగన్ సర్కార్ ఆఫర్లు?
తిరుమల: 75 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. సభ్యుల్లో కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్రమంత్రులు.. ముగ్గురిని సిఫార్సు చేసారని తెలుస్తోంది. ఏదో ఒక రకంగా కేంద్రపెద్దలను వైసీపీ నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ ఎత్తుగడలను అధిష్టానానికి కొందరు ఏపీ బీజేపీ నేతలు ఉప్పందించారు.