టీటీడీ ఉద్యోగి..

ABN , First Publish Date - 2021-02-25T04:54:46+05:30 IST

నందికొట్కూరు పట్టణంలో బుధవారం టీటీడీ ఉద్యోగి చిలుకా సురేష్‌ (45) ఆత్మహత్య చేసుకున్నారు.

టీటీడీ ఉద్యోగి..

నందికొట్కూరు, ఫిబ్రవరి 24: నందికొట్కూరు పట్టణంలో బుధవారం టీటీడీ ఉద్యోగి చిలుకా సురేష్‌ (45) ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరుకు చెందిన సురేష్‌ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలతో అక్కడే ఉంటున్నాడు. తల్లి సంవత్సరీకం కోసం నందికొట్కూరులోని తన పెద్దమ్మ ఇంటికి వచ్చి ఇంట్లో ఉరివేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సురేష్‌ పెద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-25T04:54:46+05:30 IST