బీజేపీ నేత యామినిపై కేసు పెట్టిన టీటీడీ

ABN , First Publish Date - 2020-08-14T17:39:40+05:30 IST

బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ చేసిన వ్యాఖ్యలను..

బీజేపీ నేత యామినిపై కేసు పెట్టిన టీటీడీ

అమరావతి: బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ చేసిన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీరియస్‌గా తీసుకుంది. అయోధ్య రామాలయం భూమి పూజను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా యామిని మండిపడ్డారు. హిందూ మనోభావాలను ఎస్వీబీసీ చానల్ పట్టించుకోలేదని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు యామినిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-14T17:39:40+05:30 IST