ఫిబ్రవరి నెలకు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
ABN , First Publish Date - 2022-01-27T14:23:54+05:30 IST
ఫిబ్రవరి నెలకు శ్రీవారి దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
అమరావతి : ఫిబ్రవరి నెలకు శ్రీవారి దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది. 29న ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.