కోవిడ్ ఆస్పత్రులుగా టీటీడీ అతిథి గృహాలు

ABN , First Publish Date - 2020-06-30T21:24:59+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాలన్నీ కోవిడ్ ఆస్పత్రులుగా మారిపోతున్నాయి.

కోవిడ్ ఆస్పత్రులుగా టీటీడీ అతిథి గృహాలు

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాలన్నీ కోవిడ్ ఆస్పత్రులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే తిరుపతి పద్మావతి నిలయం, ఆ తర్వాత వికృతమాలలోని వేలాది గృహాలను క్వారంటైన్‌గా మార్చారు. తాజాగా శ్రీనివాసంను కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాధవం అతిథి గృహాన్ని.. డాక్టర్లు ఎవరికైనా కరోనా సోకితే వాళ్లకు క్వారంటైన్‌గా ఈ గృహాన్ని వినియోగిస్తారు. చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1473 కేసులు నమోదు కాగా 534 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. 933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-06-30T21:24:59+05:30 IST