శ్రీవారిసేవలో జస్టిస్ జయసూర్య
ABN , First Publish Date - 2021-11-28T07:43:24+05:30 IST
శ్రీవారిసేవలో జస్టిస్ జయసూర్య
తిరుమల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య శనివారం ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇన్కమ్ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ పవన్కుమార్, అడిషనల్ కమిషనర్ సారీష్ కుమార్, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.