2020-21 సంవత్సరానికి రూ.2553 కోట్లతో టీటీడీ రివైజ్డ్ బడ్జెట్‌

ABN , First Publish Date - 2021-02-27T15:38:59+05:30 IST

తిరుమల: 2020-21 సంవత్సరానికి 2553 కోట్ల రూపాయలతో రివైజ్డ్ బడ్జెట్‌ను టీటీడీ రూపొందించింది. రూ.3309 కోట్ల అంచనాతో

2020-21 సంవత్సరానికి రూ.2553 కోట్లతో టీటీడీ రివైజ్డ్ బడ్జెట్‌

తిరుమల: 2020-21 సంవత్సరానికి 2553 కోట్ల రూపాయలతో రివైజ్డ్ బడ్జెట్‌ను టీటీడీ రూపొందించింది. రూ.3309 కోట్ల అంచనాతో గతంలో టీటీడీ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టింది. కరోనా కారణంగా టీటీడీకి హుండీతో పాటు ఇతరత్రా ఆదాయాలు తగ్గిపోయాయి. గత ఏడాది హుండీ ద్వారా టీటీడీకి 721 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. 2021-22కి 2837 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. టీటీడీ చరిత్రలో మొట్ట మొదటి సారిగా గత ఏడాది కంటే బడ్జెట్ తగ్గింది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో బడ్జెట్ అంచనాలను ఆర్థికశాఖాధికారులు కుదించారు.

Updated Date - 2021-02-27T15:38:59+05:30 IST