TTD: తిరుమలలో దర్శనాల సంఖ్య పెంపుకు టీటీడీ విముఖత
ABN , First Publish Date - 2021-07-17T15:21:12+05:30 IST
శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్నప్పటికీ దర్శనాల సంఖ్యను పెంచేందుకు టీటీడీ విముఖత వ్యక్తం చేస్తోంది.
తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్నప్పటికీ దర్శనాల సంఖ్యను పెంచేందుకు టీటీడీ విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగష్టు మాసంలో కూడా రోజుకు 5 వేల చొప్పునే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 20న ఆగష్టు మాసం కోటా టిక్కెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. థర్డ్ వేవ్పై క్లారిటి వచ్చేవరకు దర్శనాల సంఖ్యను పెంచకుండా యధాస్థితిని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది.