యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తా: బక్కని
ABN , First Publish Date - 2021-08-01T09:24:25+05:30 IST
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. శనివారం
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ, మండల, నియోజకవర్గాల్లోని యువత పార్టీకి నెట్వర్క్గా, ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ తెలుగు యువత నాయకులు కేబీఆర్ పార్కు వద్ద భిక్షాటన చేశారు.