ప్రభుత్వం అసమర్థత వల్ల పోలవరం శాపం కాబోతోంది: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-04-21T18:05:50+05:30 IST
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అసమర్థత, అవినీతి వల్ల వర ప్రసాదిని లాంటి పోలవరం శాపం కాబోతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అసమర్థత, అవినీతి వల్ల వర ప్రసాదిని లాంటి పోలవరం శాపం కాబోతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. గ్రావిటీ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాబోతోందన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ చిన్న రిజర్వాయర్ కాబోతోందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో ఆదా చేసింది రూ.222.44 కోట్లు అన్నారు. అదనపు వ్యయం పేరుతో ఖాజానాపై మోపిన అదనపు భారం రూ.3,222 కోట్లు, ఈ చర్యను ఏమనాలని తులసిరెడ్డి ప్రశ్నించారు.