మోదీకి అన్నదాతపై ఇంత కక్ష?: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-02T18:33:21+05:30 IST

అమరావతి: ప్రధాని మోదీకి అన్నదాతపై ఇంత కక్ష ఎందుకని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి ప్రశ్నించారు.

మోదీకి అన్నదాతపై ఇంత కక్ష?: తులసిరెడ్డి

అమరావతి: ప్రధాని మోదీకి అన్నదాతపై ఇంత కక్ష ఎందుకని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా 3 నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చారన్నారు. మీరు చెప్పారని ఏపీ ముఖ్యమంత్రి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి తద్వారా రైతుల మెడకు ఉరి తాళ్లు బిగించాలని నిర్ణయించారన్నారు. ట్రాక్టరు లేనిదే రైతు వ్యవసాయం చేయలేడన్నారు. డీజిల్ లేనిది ట్రాక్టర్ కదలదని.. అటువంటి డీజిల్ ధర విపరీతంగా పెరిగిందన్నారు. ఇది చాలదన్నట్లు రసాయన ఎరువుల ధరలు బస్తాకు 100 నుంచి 250 వరకు పెంచాలని నిర్ణయించడం అమానుషమన్నారు. 


రైతుకు మేలు మాటల్లో కాదు చేతల్లో ఉండాలని తులసిరెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-03-02T18:33:21+05:30 IST