చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయం: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-13T20:11:52+05:30 IST

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయమని తులసిరెడ్డి అన్నారు.

చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయం: తులసిరెడ్డి

విజయవాడ: తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయడానికి ఇదే తాజా నిదర్శనమన్నారు. అన్నం పెట్టమని అడిగితే చాక్లెట్ ఇచ్చినట్లుగా వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. గ్రామ వార్డ్ వాలంటీర్లు 19 నెలలుగా పనిచేస్తున్నా వారికి కనీస వేతనం, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లేవని, ఉపాధి హామీ పథకం కూలీలకు లభించే మొత్తం కూడా లభించడంలేదన్నారు. ప్రభుత్వం వారితో వెట్టిచాకిరి చేయిస్తోందన్నారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించమని, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి అమలు చేయాలని ప్రభుత్వాన్ని వాలంటీర్లు అడిగితే.. జగన్ సర్కార్ అవి చేయకుండా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గోటితో గిల్లుతూ నోటితో జోల పాడినట్లుందని తులసీరెడ్డి ఎద్దేవా చేశారు.


Updated Date - 2021-04-13T20:11:52+05:30 IST