మోదీ ప్రభుత్వానిది చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-03-09T19:57:01+05:30 IST
విశాఖ స్టీల్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ: విశాఖ స్టీల్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలపై ప్రభుత్వ దుశ్శాసన పర్వం గర్హనీయమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత మహిళలు పాదయాత్ర చేసి కనకదుర్గ అమ్మవారిని దర్శించు కోవాలనుకోవడం నేరమా??? అని వైసీపీ ప్రభుత్వాన్ని తులసిరెడ్డి ప్రశ్నించారు. మహాభారతంలో ద్రౌపదిని ఈడ్చుకెళ్లిన దుశ్శాసనుడికి ఏగతి పట్టిందో గుర్తుకు తెచ్చుకుంటే మంచిదన్నారు. దుగరాజపట్నం వద్ద లేదా రామాయంపేట వద్ద గానీ మేజర్ పొర్టు నిర్మించకపొవడం ద్వారా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.