తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-08-14T15:50:20+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.
కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయినీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుతం 1630.63 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100:855 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 91:984 టీఎంసీలుగా నమోదు అయ్యింది. జలాశయం ఇన్ ఫ్లో 51177 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 9187 క్యూసెక్కులుగా ఉంది.