‘పసుపునకు రూ.15వేల మద్దతు ధర ఇవ్వాలి’

ABN , First Publish Date - 2020-02-28T11:07:09+05:30 IST

పసుపు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లోని మార్కెట్‌యార్డులో పసుపును పరిశీలించారు.

‘పసుపునకు రూ.15వేల మద్దతు ధర ఇవ్వాలి’

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 27: పసుపు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లోని మార్కెట్‌యార్డులో పసుపును పరిశీలించారు. రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకు న్నా రు. ఈసందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదగౌడ్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు రైతులను చాలా అన్యాయం జరుగుతుంద న్నారు. కేవలం రూ.4వేల నుంచి 4వేల500 మాత్ర మే ధర పలుకతుందన్నారు.


ఎకరం పంటకు లక్ష కుపైగా ఖర్చుఅయితే ఈధరతో కేవలం 80వేలు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇలాగే కొనసాగితే రైతులు క్రాప్‌హలీడే ప్రకటిస్తారని ఆయన తెలిపా రు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేద న్నారు. రుణమాఫీ ఇంకా కాలేదని తెలిపారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు ఎలక్షన్‌ అయిపోయే వరకు ఇచ్చారని  తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎ టు పోయిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేకపాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో రెంజర్ల సురేష్‌,  వినోద్‌కూమార్‌, కృ పాజ్యోతి, రాజశేఖర్‌, రాజేశ్వర్‌, అంబిక సత్యనారా యణ, శంకర్‌, లవంగరాజు, దాత్రిక రవి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:07:09+05:30 IST