ఎల్‌సీడీ స్క్రీన్‌తో TVS Raider బైక్ విడుదల

ABN , First Publish Date - 2021-09-17T02:45:37+05:30 IST

ఎల్‌సీడీ స్క్రీన్‌తో TVS Raider బైక్ విడుదల

ఎల్‌సీడీ స్క్రీన్‌తో TVS Raider బైక్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో టీవీఎస్ రైడర్ 125సీసీ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. టీవీఎస్ రైడర్ 125సీసీ బైక్‌ ప్రారంభ ధర రూ. 77,500 ఉంటుంది. ఎల్లో, రెడ్, బ్లాక్ రంగుల్లో టీవీఎస్ రైడర్ 125సీసీ బైక్‌ను డిజైన్ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. టీవీఎస్ రైడర్ 125 బైక్ యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని స్పోర్టివ్ మరియు షార్ప్‌గా కనిపిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 బైక్ ఒక ఎల్‌సీడీ స్క్రీన్, రైడింగ్ మోడ్స్, ట్యాప్‌లో 11.2 బీహెచ్‌పీతో వస్తుంది. టీవీఎస్ రైడర్ 125 బైక్ 67 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్య సంఖ్యను తెలుపుతోంది.

Updated Date - 2021-09-17T02:45:37+05:30 IST