భారతీయులను ఎగతాళి చేస్తూ ఇంగ్లండ్ క్రికెటర్ల ట్వీట్స్.. నెట్టింట మళ్లీ వైరల్!

ABN , First Publish Date - 2021-06-10T15:10:15+05:30 IST

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్. ఐపీఎల్ పుణ్యమా అని వీరిద్దరికీ భారత్‌లో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది.

భారతీయులను ఎగతాళి చేస్తూ ఇంగ్లండ్ క్రికెటర్ల ట్వీట్స్.. నెట్టింట మళ్లీ వైరల్!

లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్. ఐపీఎల్ పుణ్యమా అని వీరిద్దరికీ భారత్‌లో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది. అయితే వీళ్లిద్దరూ భారతీయులను ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేశారు. ఇవి ఇప్పుడు చేసినవి కావు. గతంలో ఎప్పుడో చేసిన ఈ ట్వీట్స్ మళ్లీ నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇటీవల ఇంగ్లండ్ జట్టులోని ఓలీ రాబిన్‌సన్ జాతివిద్వేష ట్వీట్లు చేసిన కారణంగా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలోనే బట్లర్, మోర్గాన్ చేసిన ట్వీట్లు నెట్టింట్లో మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి. వీటిలో మోర్గాన్, ‘‘సర్, యూ ప్లే వెరీ గుడ్ ఓపెనింగ్ బ్యాటింగ్’’ అని ట్వీట్ చేయగా.. ‘‘ఐ ఆల్వేస్ రిప్లై సర్ నో1 ఎల్స్ లైక్ మి లైక్ యూ లైక్ మి’’ అని బట్లర్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2021-06-10T15:10:15+05:30 IST