ఎయిమ్స్‌లో బీహార్ యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-05T16:03:54+05:30 IST

బీహార్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసు గల ఓ యువకుడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది....

ఎయిమ్స్‌లో బీహార్ యువకుడి ఆత్మహత్య

న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసు గల ఓ యువకుడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు శుక్రవారం ఎయిమ్స్ లోని రెండో అంతస్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.ఢిల్లీ పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.

Updated Date - 2020-06-05T16:03:54+05:30 IST