నీళ్ల ట్యాంకు కడుగుతూ విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-09-17T17:31:06+05:30 IST

నీళ్ల ట్యాంకు శుభ్రం చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మరణించిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర పరిధి మాటుంగా ప్రాంతంలో జరిగింది....

నీళ్ల ట్యాంకు కడుగుతూ విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ముంబై : నీళ్ల ట్యాంకు శుభ్రం చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మరణించిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర పరిధి మాటుంగా ప్రాంతంలో జరిగింది. మాటుంగా ప్రాంతంలోని రైల్వే అధికారి ఇంట్లో నీళ్లట్యాంకును బాబు గొండా అనే యువకుడు శుభ్రం చేస్తున్నాడు. నీళ్ల ట్యాంకు కడుగుతుండగా బాబు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కార్మికుడు బాబును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. ముంబై పోలీసులు బాబు మృతి ఘటనపై కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-17T17:31:06+05:30 IST