మంగళూరు ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్

ABN , First Publish Date - 2022-01-12T12:19:18+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీతో 20 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు....

మంగళూరు ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్

20మంది కార్మికులకు అస్వస్థత

మంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీతో 20 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. మంగళూరు నగరంలోని బైకంపడి పారిశ్రామికవాడలోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది.ఈ గ్యాస్ లీకేజీతో ఫ్యాక్టరీలోని 20 కార్మికులు తీవ్ర అస్వస్థతకు పాల్పడ్డారు. అస్వస్థతకు గురైన కార్మికులను సమీపంలోని వైద్యకళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.గ్యాస్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాస్ లీకేజీకి కారణాలు తెలియలేదు. 


Updated Date - 2022-01-12T12:19:18+05:30 IST