జమ్మూకశ్మీర్‌లో Encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-01-10T13:31:48+05:30 IST

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అల్-బదర్ ఉగ్రవాదులు హతమయ్యారు...

జమ్మూకశ్మీర్‌లో Encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

 శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అల్-బదర్ ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన 7వ ఎన్‌కౌంటర్.10రోజుల్లో ఇప్పటివరకు 13 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా హుసన్‌పోరా గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగింది.హుస్సేన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన నిర్దిష్ట సమాచారం తర్వాత పోలీసులు, ఆర్మీ, సీఆర్పీ‌ఎఫ్ సంయుక్త బృందం గాలింపు ప్రారంభించిందని పోలీసు అధికారి తెలిపారు. శోధన బృందం అనుమానాస్పద ప్రదేశాన్ని చుట్టుముట్టడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని పోలీసులు తెలిపారు.ఇంతకుముందు జరిగిన 6 ఎన్‌కౌంటర్లలో ఆరుగురు పాకిస్థానీలు మరణించారు. ఉగ్రవాదుల నుంచి అమెరికన్ మేడ్ రైఫిల్స్, రెండు ఏకే 56, 2ఏకే 47 రైఫిల్స్‌తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2022-01-10T13:31:48+05:30 IST