రౌడీషీటర్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-27T13:34:29+05:30 IST
రౌడీషీటర్ హత్య కేసులో బహదూర్పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి ...
హైదరాబాద్/మదీన : ఈ నెల 20న రాత్రి బహదూర్పురాలో జరిగిన రౌడీషీటర్ హత్య కేసులో బహదూర్పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ డి.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్ మరాఠీ గల్లీ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ ఎజాజ్ ఈ నెల 20న అర్ధరాత్రి అతడి ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బహదూర్పురా పోలీసులు పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. కిషన్బాగ్ చిరాగ్అలీ నగర్ ప్రాంతానికి చెందిన రఫీఖ్(65), దావూద్(18)లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. గతంలో వీరికి, హతుడు మహ్మద్ ఎజాజ్కు పాతకక్షలున్నాయి. పాతకక్షల కారణంగానే హత్య చేశారు. దీంతో నిందితులిద్దరినీ బుధవారం రిమాండ్కు తరలించారు.