రౌడీషీటర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-27T13:34:29+05:30 IST

రౌడీషీటర్‌ హత్య కేసులో బహదూర్‌పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి ...

రౌడీషీటర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్/మదీన : ఈ నెల 20న రాత్రి బహదూర్‌పురాలో జరిగిన రౌడీషీటర్‌ హత్య కేసులో బహదూర్‌పురా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ డి.దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌ మరాఠీ గల్లీ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ ఎజాజ్‌ ఈ నెల 20న అర్ధరాత్రి అతడి ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బహదూర్‌పురా పోలీసులు పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. కిషన్‌బాగ్‌ చిరాగ్‌అలీ నగర్‌ ప్రాంతానికి చెందిన రఫీఖ్‌(65), దావూద్‌(18)లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. గతంలో వీరికి, హతుడు మహ్మద్‌ ఎజాజ్‌కు పాతకక్షలున్నాయి. పాతకక్షల కారణంగానే హత్య చేశారు. దీంతో నిందితులిద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-05-27T13:34:29+05:30 IST