దోపిడీ ఘటనలో ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-09T22:50:47+05:30 IST
నగరంలో జరిగిన దోపిడీ ఘటనను కేవలం ఆరు గంటల్లో పోలీసులు
విశాఖ: నగరంలో జరిగిన దోపిడీ ఘటనను కేవలం ఆరు గంటల్లో పోలీసులు ఛేదించారు. మర్రిపాలెంలో ఉపాధ్యాయుని దారి దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మర్రిపాలెం పంజాబ్ హోటల్ వద్ద దారి దోపిడీ జరిగింది. దోపిడీ జరిగిన ఆరు గంటల్లో కేసును పోలీసులు ఛేదించారు. బంగార్రాజు, సాయికుమార్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరి నుంచి ఒక సెల్ ఫోన్, చైన్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.