రెండు ఆటోలు ఢీ.. డ్రైవర్ మృతి.. ఒకరి పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2020-08-15T17:43:24+05:30 IST
భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో శుక్రవారం రెండు ఆటోలు..
బుచ్చెయ్యపేట(విశాఖపట్నం): భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో శుక్రవారం రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో బంగారుమెట్టకు చెందిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చినపాచిలికి చెందిన ఆటో చోడవరం నుంచి రావికమతం వస్తుండగా, గౌరీపట్నానికి చెందిన ఆటో వడ్డాది నుంచి చోడవరం వైపు వెళుతోంది. బొడ్డేరు వంతెన సమీపంలోకి వచ్చేసరికి ఈ రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గుమ్మాలపాడుకు చెందిన ఆటో డ్రైవర్ కె.కొండబాబు (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
అలమండ మోహన్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ డి.వెంకన్న 108 అంబులెన్సుకు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయకపోవడంతో క్షతగాత్రులను తన వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.