పులి దాడిలో రెండు పశువులు మృతి

ABN , First Publish Date - 2021-02-27T08:40:16+05:30 IST

పశువుల మం దపై పులి దాడి చేయడంతో రెండు జీవాలు చనిపోయాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌జిల్లా బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన ముగ్గురు కాపర్లు గురువారం పశువులను మేతకు తీసుకెళ్లారు.

పులి దాడిలో రెండు పశువులు మృతి

బెజ్జూరు/పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 26: పశువుల మం దపై పులి దాడి చేయడంతో రెండు జీవాలు చనిపోయాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌జిల్లా బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన ముగ్గురు కాపర్లు గురువారం పశువులను మేతకు తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో మందపై పులి దాడి చేసి ఒక ఆవు, ఎద్దును చంపేసింది. బె జ్జూరు రేంజ్‌ అటవీ అధికారు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పెద్దపులి పంట చేలలో సంచరిస్తున్నందున పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లొద్దని గ్రామస్థులకు సూచించారు. 


Updated Date - 2021-02-27T08:40:16+05:30 IST