విద్యుదాఘాతంతో రెండు ఆవుల మృతి

ABN , First Publish Date - 2021-06-22T07:22:04+05:30 IST

మండలంలోని బొమ్మేపల్లి శివారులో రెండు ఆవులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి.

విద్యుదాఘాతంతో రెండు ఆవుల మృతి

కనగల్‌, జూన్‌ 20: మండలంలోని బొమ్మేపల్లి  శివారులో రెండు ఆవులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బొమ్మేపల్లి గ్రామానికి చెందిన పల్లెబోయిన భిక్షం తన రెండు ఎద్దులను మేతకు తీసుకువెళ్లాడు. గ్రామ శివారులో  పెద్దులు వ్యవసాయభూమిలో ఎద్దులు మేత మేస్తూ  ట్రాన్స్‌పార్మర్‌ను అంటుకుని రెండు ఆవులు అక్కడిక క్కడే మృతి చెందాయి. ఆవుల మృతితో రూ.80వేల  నష్టం వాటిల్లిందని బాధిత రైతు భిక్షం తెలిపాడు. విద్యుత్‌ అధికారులు తనకు నష్టంపరిహారం చెల్లించాని కోరాడు. విద్యుత్‌ సిబ్బంది ఘటనా  స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.  ఇదే ట్రాన్స్‌పార్మ ర్‌ను అంటుకుని  రెండేళ్ల క్రితం రెండు ఎద్దులు మృతి చెందాయి. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయా లని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-06-22T07:22:04+05:30 IST