రెండు పాడి ఆవులు మృతి

ABN , First Publish Date - 2022-01-27T04:36:31+05:30 IST

పాడి ఆవులు తాగే కుడితిలో విషగుళికలు కలపడంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి.

రెండు పాడి ఆవులు మృతి
ఆవుల కలేబరాలను పరిశీలిస్తున్న ఏఎస్‌ఐ

సంబేపల్లె, జనవరి 26: పాడి ఆవులు తాగే కుడితిలో విషగుళికలు కలపడంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి. వివరాల్లోకెళితే... వంగిమళ్లవాండ్లపల్లె వాసి కృష్ణారెడ్డి, లలితమ్మ దంపతులు పాడే జీవనాధారంగా జీవిస్తున్నారు. రో జు వారి దినచర్యలో భాగంగా పాడి ఆవులను ఉదయం కుడితి తాగేందుకు వదిలారు. కుడితి తాగిన పాడి ఆవులు అరగంటలో గిలగిలా కొట్టుకుని మృతి చెంద డం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎ్‌సఐ రాముడు సంఘటనా స్థలి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. 


Updated Date - 2022-01-27T04:36:31+05:30 IST