ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-05-31T11:36:09+05:30 IST
నల్గొండ జిల్లా అడవిదేవురపల్లి మండలం బాలెంపల్లిలో శనివారం గుంటూరు జిల్లాకు చెందిన ఇరువురు ఈత ప్రమాదంలో మృతువాత పడ్డారు. దుర్గి మండలం ముటుకూరు శివారు తండా
దుర్గి, మే 30: నల్గొండ జిల్లా అడవిదేవురపల్లి మండలం బాలెంపల్లిలో శనివారం గుంటూరు జిల్లాకు చెందిన ఇరువురు ఈత ప్రమాదంలో మృతువాత పడ్డారు. దుర్గి మండలం ముటుకూరు శివారు తండా నెహ్రూనగర్కు చెందిన రామావత్ రంగేష్నాయక్(17), బొల్లాపల్లి మండలం గండిగనుమలకు చెందిన వాంగ్నావత్ శ్రీనివాస్నాయక్ (30) శుక్రవారం బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లారు. ఊరికి దగ్గరలో కృష్ణానది బ్యాక్ వాటర్లో ఈత కొడదామని దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయారు. శ్రీనివాస్నాయక్కు నాలుగేళళల క్రితం వివాహం కాగా ఎనిమిది నెలల పాప ఉంది. రంగేష్నాయక్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బంధువుల ఇంట వేడుకకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిన వీరి మృతి ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.