సిబ్బంది కనిపించడంలేదని ఫిర్యాదు.. తీరా చూస్తే రెస్టారెంట్ ట్యాంకులో మృతదేహాలు!

ABN , First Publish Date - 2020-06-06T04:11:19+05:30 IST

మహారాష్ట్రలోని థానేలో ఓ రెస్టారెంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు.

సిబ్బంది కనిపించడంలేదని ఫిర్యాదు.. తీరా చూస్తే రెస్టారెంట్ ట్యాంకులో మృతదేహాలు!

థానే: మహారాష్ట్రలోని థానేలో ఓ రెస్టారెంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వారిని చంపి వాళ్లు పనిచేసే రెస్టారెంట్లోని నీళ్ల ట్యాంకుల్లో పడేశారు. ఆ తర్వాత రెస్టారెంట్ యజమానికి ఫోన్ చేసి, అక్కడ పనిచేసే ఇద్దరిని చంపేసినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో భయపడిపోయిన సదరు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద పనిచేసే మేనేజర్ హరీష్ శెట్టి(42), వెయిటర్ ఎన్ పండిట్ కనిపించడం లేదని చెప్పాడు. వీళ్లిద్దరూ తన రెస్టారెంట్లోనే ఉండేవారని కూడా వెల్లడించాడు. అలాగే తనకు వచ్చిన ఫోన్ వివరాలు కూడా వారికి తెలియజేశాడు. దీంతో రెస్టారెంట్ పరిసరాల్లో గాలింపు చేపట్టిన పోలీసులకు.. రెస్టారెంట్లోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకులో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-06T04:11:19+05:30 IST