పశ్చిమబెంగాల్ సచివాలయంలో ఇద్దరు డ్రైవర్లకు కరోనా

ABN , First Publish Date - 2020-06-04T17:50:32+05:30 IST

కోల్‌కతా నగరంలోని పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయంలో ఇద్దరు డ్రైవర్లకు కరోనా వైరస్ సోకింది....

పశ్చిమబెంగాల్ సచివాలయంలో ఇద్దరు డ్రైవర్లకు కరోనా

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): కోల్‌కతా నగరంలోని పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయంలో ఇద్దరు డ్రైవర్లకు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. సచివాలయాన్ని శానిటైజ్ చేయించారు. ఇద్దరు డ్రైవర్లతో కలిసి పనిచేసిన ఉద్యోగులను  ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,500 కు పెరిగింది. 

Updated Date - 2020-06-04T17:50:32+05:30 IST