ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

ABN , First Publish Date - 2020-03-17T15:14:05+05:30 IST

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది.

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. మలికిపురం మండలం మోరిపోడులో ఇంటర్ రెండవ సంవత్సరపు విద్యార్థిని(17)  కళాశాలకు వెళ్లి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామిడికుదురు మండలం కరవాక గ్రామానికీ చెందిన 9వ తరగతి విద్యార్థిని(14) అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-03-17T15:14:05+05:30 IST