వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువతుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-13T12:12:21+05:30 IST

ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి తిరిగిరాలేదు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువతుల అదృశ్యం

హైదరాబాద్/మదీన : ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. ఉస్మాన్‌బాగ్‌ కామాటిపురాకు చెందిన మహ్మద్‌ ఆసిఫుద్దీన్‌ కుమార్తె రేష్మా(20) ఈ నెల11న రాత్రి 8 గంటల సమయంలో ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. పరిసరాల్లో, తెలిసినవారిని వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


- చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌ కాలనీకి చెందిన ముజఫర్‌ హుసేన్‌ కుమార్తె కనీజ్‌ ఫాతిమా(19) ఈ నెల 10న సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసినవారిని వాకబు చేశారు. అనంతరం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-01-13T12:12:21+05:30 IST