ఎలువుల్లంకలో రెండు తాటాకిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-01-19T06:55:49+05:30 IST

రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంకలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమై రెండు కుటుంబాల వారు నిరాశ్రుయులయ్యారు.

ఎలువుల్లంకలో రెండు తాటాకిళ్లు దగ్ధం

అల్లవరం, జనవరి 18: రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంకలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమై రెండు కుటుంబాల వారు నిరాశ్రుయులయ్యారు. పొయ్యిలోని నిప్పు ద్వారా దడి అంటుకుని బొంతు శ్రీనివాసరావు, బొంతు నాగేశ్వరరావులకు చెందిన రెండు తాటాకిళ్లు పూర్తిగా కాలిపోయ్యాయి. రూ.2లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధిత కుటుంబాలకు సాధనాల వెంకట్రావు, సాధనాల శ్రీను, రాజులు బియ్యం,  నిత్యావరాలు అందజేశారు. నడింపల్లి వెంకటసుబ్బరాజు 50 కిలోల బియ్యం, నడింపల్లి నాగబాబురాజు రూ.10వేలు, నడింపల్లి వాసురాజు రూ.10వేలు, పంచాయతీ కార్యదర్శి అడబాల రాజాలు బియ్యం, నిత్యావసరాలు   అందించారు.   


Updated Date - 2021-01-19T06:55:49+05:30 IST