టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఇద్దరు

ABN , First Publish Date - 2020-10-20T09:02:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం లభించింది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో ఉన్నారు.

టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఇద్దరు

అయ్యన్న కొనసాగింపు

కొత్తగా వంగలపూడి అనితకు స్థానం

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం లభించింది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో ఉన్నారు. ఆయనకు మరోమారు స్థానం దక్కింది. శ్రీకాకుళానికి చెందిన కింజరాపు ఎర్రన్నాయుడు మరణాంతరం అయ్యన్నపాత్రుడ్ని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన కొనసాగుతున్నారు.


కొత్తగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలు వంగలపూడి అనితకు పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇచ్చారు. కాగా ఎస్సీ మహిళ కోటాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి గతంలో ప్రతిభాభారతి పొలిట్‌బ్యూరోలో ఉండేవారు. ఆమె తరువాత అదే సామాజిక వర్గానికి చెందిన అనితకు అవకాశం వచ్చింది. 


Updated Date - 2020-10-20T09:02:11+05:30 IST