వ్యవసాయ బావిలో చిన్నారుల శవాలు.. లభించని తల్లి ఆచూకీ
ABN , First Publish Date - 2021-01-08T16:12:32+05:30 IST
చిత్తూరు: వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
చిత్తూరు: వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు నగరంలోని 46వ డివిజన్ ఓబనపల్లికి చెందిన బేబి(28) తన బిడ్డలు.. ఉదయ్(5), ఝాన్సీ(8)లతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి కోసం వెదకుతూనే ఉన్నారు. కాగా.. పిల్లల మృతదేహాలు శుక్రవారం స్థానిక వ్యవసాయ బావిలో లభ్యమయ్యాయి. తల్లి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. బేబి కూడా ఆత్మహత్యకు పాల్పడిందా? లేదంటే ఎక్కడైనా తలదాచుకుందా? అని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.