కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-08-14T14:49:48+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ ప్రాంతంలో శుక్రవారం భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.....
మండీ (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ ప్రాంతంలో శుక్రవారం భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. మండీలోని హనోజీ దేవాలయం సమీపంలో మూడు వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. కుల్లూ మార్గంలో నిత్యావసరాలు, కూరగాయలు తీసుకువెళుతుండగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హనోజీ దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. దేవాలయం సమీపంలో వాహనాలు నిలిపిఉంచగా కొండచరియలు విరిగి పడి ప్రమాదం జరిగిందని మండీ జిల్లా ఎస్పీ చాంద్ శర్మ చెప్పారు. వరదల వల్ల పాగల్ నాలా పొంగి ప్రవహించడంతో కుల్లూ జిల్లాలో రాష్ట్ర రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.