హైదరాబాద్‌లో మిస్టరీగా యువతి, మహిళ మిస్సింగ్

ABN , First Publish Date - 2021-01-16T12:17:58+05:30 IST

హైదరాబాద్‌లో మిస్టరీగా యువతి, మహిళ మిస్సింగ్

హైదరాబాద్‌లో మిస్టరీగా యువతి, మహిళ మిస్సింగ్

హైదరాబాద్/బాలానగర్‌ : స్నేహితురాలి పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళ్లి వస్తానని చెప్పిన యువతి ఇంటికి తిరిగిరాలేదు. వివరాల్లోకి వెళ్లితే.. బాలానగర్‌  పోలీస్‌స్టేషన్‌ పరిధి ఇందిరానగర్‌లో నివాసముండే లక్ష్మ య్య మూడో కూతురు పి. జానకి (19) ముసాపేటలో ఉండే తన స్నేహితురాలి బర్త్‌డే ఫంక్షన్‌ ఉందని చెప్పి గురువారం సాయ్రంతం 4 గంటలకు వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో సోదరుడు ఆంజనేయులు ఆమె సెల్‌కు ఫోన్‌ చేశాడు. ఫం క్షన్‌ లేట్‌ అవుతుందని, శుక్రవారం ఉదయం వస్తానని చెప్పింది. ఉదయం 11 గంటలకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ అని వచ్చింది. స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీ తెలిస్తే  040-27854001, 94906 17114, 93466 19320 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని బాలానగర్‌ సీఐ వహీదుద్దీన్‌ సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరోచోట గృహిణి

బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. గాజులరామారం ఇందిరానగర్‌కు చెందిన పి. సంతోష్‌ భార్య ఆర్తి(32) ఈ నెల 14న షాపూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తున్నానంటూ, ఏటీఎం నుంచి రూ. 10 వేలు డ్రా చేసింది. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువులు, తెలిసిని వారి వద్ద వెతికారు. ఫలితం లేకపోవడంతో భర్త సంతోష్‌ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-01-16T12:17:58+05:30 IST