బీజేపీలో చేరిన టీఆర్ఎస్ రాష్ట్ర నేత
ABN , First Publish Date - 2021-06-22T17:21:23+05:30 IST
పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు...
హైదరాబాద్ సిటీ/ఆనంద్బాగ్/మౌలాలి : టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వీకే మహేష్ సోమవారం ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి తరుణ్చూంగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. మహేష్ తోపాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షురాలు నాగకుమారి, పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. మౌలాలి టీఆర్ఎస్ అధ్యక్షుడు మోహన్ యాదవ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్గా రజనీకర్ రెడ్డి..
రామంతాపూర్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్గా రామంతాపూర్కు చెందిన ధర్మా రజనీకర్రెడ్డి నియమితులయ్యారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ ఆయనకు ఉత్తర్వులు అందజేసి సత్కరించారు.