ఇద్దరు మంత్రులకు, 2,111 మంది పోలీసులకు Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-22T13:21:35+05:30 IST
రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా, ఇద్దరు మంత్రులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా అస్వ స్థతగా ఉన్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్, వాణిజ్య, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తిలకు
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా, ఇద్దరు మంత్రులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా అస్వ స్థతగా ఉన్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్, వాణిజ్య, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తిలకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, వైద్యుల సూచనల మేరకు మంత్రి రామచంద్రన్ నీలగిరి జిల్లా కున్నూర్లోని తన ఇంట్లో హోం క్వారంటైన్లో ఉండగా, మంత్రి మూర్తి మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమను కలసిన అధికారులు, పార్టీ నేతలు పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.
2,111 మంది పోలీసులకు...
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,111 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో వేలూరు ఎస్పీ రాజే్షఖన్నా సహా 18 మంది ఎస్పీలు, ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే 328 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీసు శాఖ తెలియజేసింది.