ఒకేసారి రెండు నెలల బియ్యం
ABN , First Publish Date - 2022-01-15T07:33:11+05:30 IST
పీఎంజీకేఎ్సవై కింద రెండు నెలల బియ్యాన్ని ఈ నెలలో పంపిణీ చేయనున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 14: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఎ్సవై) కింద రెండు నెలల బియ్యాన్ని ఈ నెలలో పంపిణీ చేయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని గతేడాది డిసెంబరు నుంచి కేంద్రం పొడిగించింది. జిల్లాలో బియ్యం నిల్వ లేకపోవడంతో డిసెంబరులో కార్డుదారులకు పంపిణీ చేయలేదు. భారత పౌరసరఫరాల సంస్థ(ఎ్ఫఎ్సఐ) నెలకు 18 వేల టన్నుల చొప్పున రెండు నెలలకు కలిపి 36వేల టన్నుల బియ్యాన్ని కాకినాడ నుంచి జిల్లాకు సరఫరా చేసింది. ఈ నెల 18నుంచి రేషన్ డీలర్ల ద్వారా రెండు నెలల బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు ఇన్చార్జి డీఎస్వో కోదండరామిరెడ్డి తెలిపారు.