మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సల్స్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-14T09:16:55+05:30 IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దనోరా తాలూకాలో పెద్దసంఖ్యలో నక్సలైట్లు సమావేశమయ్యారన్న సమాచారంతో సీ-60 దళాలు అటవీ ప్రాంతంలో

మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సల్స్‌ మృతి

మహదేవపూర్‌, మే 13: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దనోరా తాలూకాలో పెద్దసంఖ్యలో నక్సలైట్లు సమావేశమయ్యారన్న సమాచారంతో సీ-60 దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ప్రారంభించాయి. అయితే, కూంబింగ్‌ జరుగుతోన్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా టిప్పఘడ్‌ ప్లాటూన్‌ నం.15 సభ్యుడు ఏరియారాజా (33) అలియాస్‌ రాంసే నోహరు మడావి, రనిత (28) అలియాస్‌ పునిత చిపారురామ్‌ గడావేగా మృతి చెందారు. 

Updated Date - 2021-05-14T09:16:55+05:30 IST