గుండాటపై దాడి.. ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-04-21T06:05:02+05:30 IST

క్రాపచింతలపూడిపాలెంలో సోమవారం రాత్రి జరిగిన రావులమ్మ జాతరలో గుండాట నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ముమ్మిడివరం ఇన్‌చార్జి ఎస్‌ఐ షేక్‌ జబ్బీర్‌ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేశారు.

గుండాటపై దాడి.. ఇద్దరి అరెస్టు

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 20: క్రాపచింతలపూడిపాలెంలో సోమవారం రాత్రి జరిగిన రావులమ్మ జాతరలో గుండాట నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ముమ్మిడివరం ఇన్‌చార్జి ఎస్‌ఐ షేక్‌ జబ్బీర్‌ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేశారు. చింతలపూడి శ్రీనివాసరావు (బుజ్జి), మెండా శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1100 నగదు, గుండాట సామగ్రి స్వాఽధీనం చేసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-04-21T06:05:02+05:30 IST