వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి

ABN , First Publish Date - 2021-04-19T21:06:01+05:30 IST

నగరంలోని వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్లంపేట

వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి

జీడిమెట్ల/దుండిగల్: నగరంలోని వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్లంపేట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృత దేహాన్ని వెలికి తీసి పోలీసులు ఆసుపత్రికి  తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


అలాగే బోరంపేట్‌లోని చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈతగాళ్ళు చెరువులో వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని బోరంపేట్ నివాసి సంతోష్ (23)గా పోలీసులు గుర్తించారు. రెండు వేరు వేరు కేసులుగా నమోదు చేసుకుని దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-19T21:06:01+05:30 IST