బాపట్లలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-06T18:30:53+05:30 IST

గుంటూరు: బాపట్లలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బాపట్లలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

గుంటూరు: బాపట్లలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యలు పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కొండలరావు వీధిలో మున్నా(30) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే విజయలక్ష్మీపురంలో కోకి దుర్గరెడ్డి (37) అనే వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కాపురంలో కలహాల కారణంగా వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-06-06T18:30:53+05:30 IST