యువతి ఆత్మహత్య.. ఎదురింటి అబ్బాయే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

ABN , First Publish Date - 2020-07-02T21:10:08+05:30 IST

చిన్న ఎల్కిచర్ల-శ్రీరాంగాపూర్‌ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీను కథనం ప్రకారం మండల పరిధిలోని అయోధ్యపూర్‌తండాకు చెందిన బడావత్‌ గోపాల్‌(50) అనే

యువతి ఆత్మహత్య.. ఎదురింటి అబ్బాయే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఉరేసుకుని వ్యక్తి మృతి.. నిప్పంటించుకొని యువతి..

వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య


కొందుర్గు (రంగారెడ్డి జిల్లా): చిన్న ఎల్కిచర్ల-శ్రీరాంగాపూర్‌ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీను కథనం ప్రకారం మండల పరిధిలోని అయోధ్యపూర్‌తండాకు చెందిన బడావత్‌ గోపాల్‌(50) అనే వ్యక్తి గతనెల 28న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. శ్రీరంగాపూర్‌ శివారులో రోడ్డుపక్కన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన ఆ లస్యంగా వెలుగులోకి రావడంతో అప్పటికే మృతదేహం పూర్తిగా దెబ్బతింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేస దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీను తెలిపారు.


నిప్పంటించుకొని యువతి..

ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అలియాబాద్‌ కు చెందిన రమేష్ కు భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలున్నారు. కాగా కూతురు పూజ(19)చదువు పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటుంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలైన ఆమెను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. తమ కూతురు ఆత్మహత్యకు ఎదురింటి అబ్బాయే కారణమని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యువతి మరణ వాంగ్మూలం ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-07-02T21:10:08+05:30 IST