బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-05-27T16:12:52+05:30 IST
వికారాబాద్: పూడూర్ మండలం సోమన్ గూర్తి సమీపంలో బైకును ఓ కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది.
వికారాబాద్: పూడూర్ మండలం సోమన్ గూర్తి సమీపంలో బైకును ఓ కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో అకస్మాత్తుగా బైక్పై నుంచి పడిపోయిన వారిపై అటుగా వస్తున్న మరో కారు పైనుంచి పోవడంతో ఇద్దరూ మృతి చెందారు. మృతులు నాగర్ కర్నూలు జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఓ విందుకు వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.