రోడ్డు ప్రమాదంలో ఇరువురి మృతి
ABN , First Publish Date - 2021-01-17T05:04:54+05:30 IST
మండలంలోని జి.కె. రాచపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (78), రెడ్డిప్రసాద్ (49) కేవీ పల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు కేవీ పల్లె పోలీసులు తెలిపారు.
సుండుపల్లె, జనవరి 16: మండలంలోని జి.కె. రాచపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (78), రెడ్డిప్రసాద్ (49) కేవీ పల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు కేవీ పల్లె పోలీసులు తెలిపారు. వివరాల మేరకు కలికిరి మండలం మహల్ గ్రామంలోని ఆసుపత్రికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా కేవీ పల్లె పంచాయతీ కమ్మపేట గ్రామం వద్ద శనివారం అతివేగంగా వస్తున్న కారు ఢీ కొనడంతో రెడ్డిప్రసాద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డి వాహనంపై పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కేవీ పల్లె ఎస్ఐ రామమోహన్ అక్కడి చేరుకుని మృతదేహాలను పీలేరు ప్రభుత్వాపత్రికి తరలించినట్లు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు.